తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట విలన్ గా తనకంటూ ఒక మంచి పాపులారిటి ని సంపాదించుకున్న నటుడు గోపీచంద్( Gopichand )ఆ తర్వాత యజ్ఞం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక మంచి విజయాన్ని అందుకునేది.
కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు అసలు కలిసి రావడం లేదు.
ఏ సినిమా చేసిన కూడా అది ప్లాప్ అవుతుంది.రీసెంట్ గా ఆయన భీమా( Bheema ) అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో చాలావరకు ఫెయిల్ అయింది.
అందువల్లే ఇకమీదట ఆయన సినిమాల్లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే కొంతమంది అభిమానులు మాత్రం గోపీచంద్ హీరో పాత్రలు చేసే కంటే విలన్ గా చేస్తే ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే గోపీచంద్ లాంటి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీలో వరుస ప్లాపులు అందు కోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
ఇక ఆయన కనక మంచి కథతో వస్తే సూపర్ హిట్ కొడతాడు.ఇక మరి ఇప్పుడైనా ఆయన ఒక యూనిక్ స్టోరీ తో వస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాకి ముందు మారుతి డైరెక్షన్ లో వచ్చిన పక్క కమర్షియల్ సినిమా కూడా ఫ్లాప్ అయింది.ఈయన స్టోరీ విని సినిమా చేస్తున్నాడా లేదంటే కాంబినేషన్ సెట్ చేసుకున్న తర్వాత సినిమాను చేస్తున్నాడు అనే విషయాలు కూడా ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
ఎందుకంటే నాసిరకమైన కథలను సెలెక్ట్ చేసుకొని ఎందుకు సినిమాలు చేస్తున్నాడు అని ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…