విజయవాడలో ఇంద్రకీలాద్రిపై పాసుల జారీ వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.స్టాఫ్ ఆన్ డ్యూటీ పేరుతో తమకు నచ్చిన వారికి పాసులు జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే స్టాఫ్ ఆన్ డ్యూటీ పేరుతో ఐడీ కార్డు వేసుకొని వస్తున్న వారిని అడ్డుకున్న ఆలయ ఈవో.సదరు మహిళను ప్రశ్నించారు.అయితే, మహిళ సమాధానం చెప్పకపోవడంతో ఐడీ కార్డు లాక్కొని వెనక్కి పంపించి వేశారు.