ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర్వాహకుల నుంచి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.జ్యూరిచ్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలని పిలుపు వచ్చింది.
కాగా, ఈ సమావేశంలో యూరప్, ఆసియాలకు చెందిన 100 మంది అత్యంత ప్రభావశీలమైన నాయకులు పాల్గొంటారు.అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ అసందిగ్ధత, యూరప్-ఆసియా కారిడార్లో సేవలందిస్తున్న బడా కంపెనీలపై దాని ప్రభావం వంటి అంశాలపై చర్చ జరగనుంది.