సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రూబీ హోటల్ యజమాని రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడుతో పాటు సూపర్ వైజర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ్ దహనం కాగా.పలువురు గాయపడ్డారు.
సెల్లార్లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు.కానీ యాజమాని అందుకు విరుద్దంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది.







