బ్రూణ హత్యల నివారణ పై గోడపత్రిక ఆవిష్కరణ

సృష్టిలో ఆడ మగ సమానమని కానీ స్త్రీ పట్ల వివక్షతతో ఆమెని గర్భస్థ పిండంలోనే చంపేస్తున్నారని ఇది అమానుషమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు అన్నారు.భ్రూణ హత్యలు, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై న్యాయమూర్తి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తో కలిసి బ్రూణ హత్యల నివారణ పై తయారుచేసిన గోడపత్రికను ఆవిష్కరించారు.‘నాకు కలలుంటాయి వాటిని సాకారం చేసుకోవడానికి నన్ను బ్రతకనివ్వండి’ అనే శీర్షిక న తయారు చేసిన గోడ పత్రికలో ఆడపిల్ల ప్రాముఖ్యతను భ్రూణహత్యల నివారణకు తీసుకోవలసిన చర్యలను హృద్యంగా చిత్రీకరించారు.

 Invention Of Wall Paper On Prevention Of Abortions , Wall Paper , V P Goutam,-TeluguStop.com

ఈ గోడ పత్రికలను ఎక్కువ ప్రదేశాలలో ప్రదర్శించి ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ హైమ పూజిత, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి మాలతి, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి జిల్లా బాలల రక్షణ అధికారి విష్ణు వందన, న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube