టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటనకు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇదే సమయంలో పార్టీ ఇన్చార్జిలతో సమావేశం అవుతూ ముఖ్య నేతలతో భేటీలు అవుతూ.
దిశా నిర్దేశం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత మొదలైందని పోలీసుల ద్వారా అణిచివేత ద్వారా నీతో వారు వ్యవహరిస్తున్న తీరుకు.
వైసీపీ పార్టీలో ఉన్న నాయకులే.అసహనంగా ఉన్నారని చంద్రబాబు సమావేశాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
టీడీపీ మళ్లీ పుంజుకుంటూ ఉంటున్న తరుణంలో తూర్పుగోదావరి టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి.
విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఒకటవ తారీఖున తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
ఈ క్రమంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యుల కమిటీ సమావేశం అయింది.
సభా వేదికపై వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవటంతో జవహర్ వర్గీయులు.ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్.ఇద్దరు సభ్యుల కమిటీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఈ కమిటీలో సుబ్బారాయ చౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు.ఈ ఇద్దరూ వేదికపై వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడంతో ఆయన వర్గీయులకు ఆగ్రహం తెప్పించినట్లు అయింది.
జవహర్ నీ కూడా వేదికపైకి పిలవాలని.ఆయన వర్గం డిమాండ్ చేసింది.
దీంతో ఘర్షణ వాతావరణ చోటు చేసుకొనడంతో ఈ ఘటనపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.