TET DSC :టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఏపీలో టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య సమయం అంశంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు టెట్, డీఎస్సీల పరీక్షల మధ్య సమయం ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు( AP High Court ) నిరాకరించింది.

ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 28 తరువాత జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.

అయితే టెట్ పరీక్షలు( TET exams ) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనుండగా.మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు( DSC exams ) జరగనున్నాయి.దీంతో రెండు పరీక్షల మధ్య గ్యాప్ తక్కువగా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు