శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.కదిరిలో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
తమ ఇంటి వద్ద వాషింగ్ మిషన్ పెట్టారని ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.ఈ క్రమంలో పద్మావతి అనే మహిళపై ఓ తండ్రి, కుమారుడు కత్తులు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని సమాచారం.
తీవ్ర గాయాలు కావడంతో పద్మావతి మృతిచెందిందని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.