విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూత పడనుంది.రాక్ ఫాల్ పనుల కోసం ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు సూచనలు జారీ చేశారు.దర్శనానికి వచ్చే వారంతా మహా మండపం నుంచి రావాలని దుర్గగుడి అధికారులు కోరారు.