భారత్ లో తొలి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది.రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్ ఇంకోవాక్ ను కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ లు లాంఛ్ చేశారు.
గత ఏడాది డిసెంబరులో బూస్టర్ డోసుగా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ.325, ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది.కాగా ఇంకోవాక్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటిక్ కంపెనీ తయారు చేసింది.