తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భానుడు తీవ్ర ప్రభావాన్ని( Sun Heat ) చూపించనున్నాడని తెలుస్తోంది.ఏపీ, తెలంగాణనే కాకుండా దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
అదేవిధంగా ఈసారి వడగాలుల ముప్పు కూడా తీవ్రమేనని ఐఎండీ చెబుతుంది.ఈ నెల నుంచి క్రమక్రమంగా పెరగనున్న ఎండలు ఏప్రిల్, మే నెలల్లో పీక్ స్టేజ్ కు చేరుకుంటాయని పేర్కొన్నట్లు సమాచారం.
ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా( High Temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది.