ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల కీలక భేటీ..!!

ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు కీలక భేటీ నిర్వహించారని తెలుస్తోంది.

ఈ మేరకు ఒంగోలులోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది.

మంత్రి మేరుగ నాగార్జున, కరణం వెంకటేశ్ తో మాజీమంత్రి బాలినేని నిర్వహించిన సమావేశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ భేటీ వెనుకాల కారణాలను నాయకులు బయటపెట్టలేదు.

అయితే గత కొంతకాలంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేశ్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటు ఆమంచి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు లేకుండానే బాలినేని అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆమంచి పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ గా ఉంటే కలిసి పని చేయలేమని బాలినేని అనుచర వర్గం చెబుతోంది.ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు సమావేశం కావడం జిల్లాలో ఆసక్తిని పెంచింది.

Advertisement
జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు