అక్రమ సంబంధం.. పెళ్లింట అనుకోని విషాదం

మానవ సంబంధాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి.క్షణికానందం కోసం ఇతరులతో వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి.

గుట్టు బయట పడకూదని కొందరు క్రూరంగా ఆలోచిస్తున్నారు.అవసరమైతే అవతలి వారిని అంతమొందించేదుకూ వెనుకాడడం లేదు.

ఇదే కోవలో ఓ వ్యక్తి చేసిన ప్లాన్ రివర్స్ అయింది.ఒకరిని చంపాలని అనుకుంటే ఆ ప్రమాదం మరొకరిని వెంటాడింది.

పెళ్లింట తీరని విషాదం నింపింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Advertisement

గుజరాత్‌లో నవసారీ జిల్లాలోని ఓ గ్రామంలో లతీష్ అనే యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది.సల్మా అనే యువతితో పెద్దలు వివాహం జరిపించారు.

సల్మాకు జాగృతి అనే అక్క ఉంది.ఆమె రాజేష్ పటేల్ అనే వ్యక్తితో 2009 నుంచి సహజీవనం చేస్తోంది.

దీంతో వీరికి ఓ కుమార్తె కూడా పుట్టింది.అయితే అప్పటికే రాజేష్‌కు వివాహమైంది.

అతడికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు.అయితే జాగృతితో సంబంధం కొనసాగించాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇటీవల ప్రియురాలితో అతడికి విభేదాలు తలెత్తాయి.దీంతో ప్రియురాలు జాగృతి, ఆమె కుమార్తె విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించాడు.

Advertisement

వారిద్దరినీ అంతమొందించాలని పన్నాగం పన్నాడు.దీంతో పక్కాగా ప్లాన్ వేసి బాంబు తయారు చేశాడు.ఓ టెడ్డీబేర్ బొమ్మ కొని, అందులో బాంబును పెట్టాడు.

లతీష్-సల్మా పెళ్లికి గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ జాగృతికి పంపించాడు.అయితే అది వధూవరులకు వచ్చిన గిఫ్ట్‌ కాబట్టి వారు ఉంటున్న గదిలో జాగృతి పెట్టింది.

పెళ్లి అయిపోయిన తర్వాత లతీష్ తనకు వచ్చిన గిఫ్ట్‌లను ఓపెన్ చేయసాగాడు. రాజేష్ పటేల్ పంపించిన గిఫ్ట్ ఓపెన్ చేయగానే అది హఠాత్తుగా పెద్ద శబ్దంతో పేలిపోయింది.

దీంతో లతీష్ చెయ్యి తెగి పడింది.అతడితో పాటు అక్కడున్న లతీష్ మేనల్లుడు జియాంష్ కూడా బాంబు పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

వారిని బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

తాజా వార్తలు