ప్రియుడుతో అత్తకు అడ్డంగా దొరికిపోయిన కోడలు..అత్త దారుణ హత్య..!

ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్న కూడా మార్పు అనేది లేకుండా వివాహేతర సంబంధాలకు కట్టుబడి ఉండే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కేవలం కొన్ని క్షణాల శారీరక సుఖం కోసం ఓ వివాహిత తన కుటుంబాన్ని తానే నాశనం చేసుకుంది.

ప్రియుడితో కలిసి సన్నిహితంగా ఉండే సమయంలో తన అత్తకు అడ్డంగా దొరికిపోయింది.దీంతో ఏం చేయాలో తెలియని కోడలు ప్రియుడుతో కలిసి ఏకంగా తన అత్తని హత్య చేసిన ఘటన బెంగుళూరులోని( Bangalore ) బ్యాడర హళ్లిలో వెలుగు చూసింది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

బ్యాడర హాళ్లి లో లక్ష్మమ్మ (50)( Lakshmamma ) అనే మహిళ కొడుకు మంజునాథ్ కు రశ్మి అనే యువతీతో వివాహం అయింది.వీరి ఇంటి మేడ పై అక్షయ్( Akshay ) అనే వ్యక్తి బాడుగకు ఉంటున్నాడు.

Advertisement

అయితే రశ్మి కు అక్షయ్ తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.అయితే అక్షయ్ సరిగ్గా అద్దె కట్టకపోవడంతో లక్ష్మమ్మకు అతనితో గొడవ పడింది.

ఈ విషయంలో కోడలు రశ్మి జోక్యం చేసుకొని అతని బాడుగ సంగతి తాను చూసుకుంటానని అత్తకు చెప్పింది.

దీంతో ఆ అత్త కోడళ్ళ మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.దీనికి తోడు అక్షయ్ తో తనకు ఉన్న అక్రమ సంబంధం( Illegal Affair ) గురించి అత్త లక్ష్మమ్మకు తెలిసిపోయింది.ఇక అప్పటి నుంచి లక్ష్మమ్మ కోడలిని మందలిస్తూ పద్ధతి మార్చుకోవాలని కాస్త గట్టిగానే చెబుతూ ఉండేది.

తన ఆనందానికి అడ్డుగా ఉన్న అతను చంపేయాలని అక్షయ్ తో కలసి రశ్మి( Rashmi ) మాస్టర్ ప్లాన్ రచించింది.ప్లాన్ లో భాగంగా ఈనెల 5వ తేదీన అత్త తినే ఆహారంలో మత్తుమందు కలిపింది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
బాల్య వివాహం : ఆరో తరగతి బాలికను వివాహం చేసుకున్న యువకుడు..

ఆహారం తిని మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడుతో కలిసి గొంతు పిసికి అత్తను హత్య చేసింది.తన అత్త గుండెపోటు తో చనిపోయిందని ప్రచారం చేసి అందరినీ నమ్మించింది.కానీ భర్త మంజునాథ్ కు ఏదో తెలియని అనుమానం కలగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి రశ్మి మొబైల్ చాటింగ్ పరిశీలించారు.దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు