తప్పుడు ఆరోపణలు చేస్తే మీరే ఫూల్స్‌ అవుతారు: ఆర్కే రోజా

గుంటూరు: అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.గుంటూరువారితోటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంత్రి బుధవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెలరోజులు రాజకీయం చేస్తోందన్నారు.తప్పుడు ఆరోపణలు చేస్తే.మీరే పూల్స్‌ అవుతారని హెచ్చరించారు.

 If You Make False Accusations.. You Will Become Fools: Rk Roja Rk Roja, Ycp Ap P-TeluguStop.com

ఇ‍ప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.

ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మేము పెట్టాం.మీరు తీసేశారని ఆరోపణలు చేసి టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube