సాయి పల్లవి, రానా జంటగా తెరకెక్కిన విరాటపర్వం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 12 కోట్ల రూపాయలు చేసిన విషయం తెల్సిందే.లాంగ్ రన్ లో ఈ సినిమా అయిదు కోట్ల వసూళ్లు దక్కించుకోవడం పెద్ద విసయం అయ్యింది.
ఇప్పుడు విరాటపర్వం సినిమా ను ఒక డిజాస్టర్ సినిమా గా తేల్చి పారేశారు.సాయి పల్లవి సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడకు వెళ్లినా కూడా వేలల్లో జనాలు వచ్చారు.
ఎక్కడికి అక్కడ ఆమె పై తమ అభిమానంను చూపించారు.లేడీ పవర్ స్టార్ అంటూ గొంతు పోయేలా అరిచారు.
దాంతో విరాట పర్వం సినిమాకు పాజిటివ్ వసూళ్లు నమోదు అవుతాయి అని అంతా భావించారు.
కాని ఇది ఒక కమర్షియల్ సినిమా కాక పోవడంతో ఆమె కూడా ఏం చేయలేక పోయింది.
సినిమా విడుదల విషయం లో కాస్త గందరగోళం నెలకొనడంతో పాటు ప్రమోషన్ సమయం లోనే ఇది ఒక సీరియస్ డ్రామా.ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
దానికి తోడు సినిమా యాంటీ క్లైమాక్స్ కూడా కలిగి ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఒకింత అనాసక్తి కనిపిస్తుంది.మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సమయంలో ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదు.
అయినా సినిమా లో సాయి పల్లవి లేకుంటే కనీసం ప్రీ రిలీజ్ బిజినెస్ అయినా అంత కాకపోయి ఉండేదని.వసూళ్లు కూడా కోటికి అటు ఇటుగానే ఉండేవి అనేది కొందరి అభిప్రాయం.కమర్షియల్ సినిమా కాకున్నా కూడా సాయి పల్లవి వల్ల మంచి డీసెంట్ వసూళ్లను రాబట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.మొత్తానికి విరాటపర్వం సినిమా అయితే డిజాస్టర్ అని తేలిపోయింది.
సాయి పల్లవికి ఇంత భారీ డిజాస్టర్ ఇదే అవ్వడం విశేషం.