వేసవి కాలం( Summer )లో చాలా మంది ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు మొదటి స్థానంలో ఉంటాయి.ఎందుకంటే ఇవి ఎంతో రుచిగా ఉండడంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యాపారస్తులు త్వరగా కాయలు పండ్లు కావాలని ఉద్దేశంతో కెమికల్స్ తో వీటిని పండిస్తున్నారు.అయితే చెట్లపై పండాల్సిన మామిడి పండ్లు రసాయనలతో పక్వానికి వస్తున్నాయి.
దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

ఇంతకీ మార్కెట్లో అమ్మే మామిడి పండ్లు సహజమైనవా, రసాయనాలతో పండించినవా ఎల గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.సహజంగా పండే మామిడి పండ్ల కంటే కృతిమంగా పండే పండ్లు ఎక్కువగా ఆకర్షణంగా ఉంటాయి.రసాయనాలతో పండించిన పండు పై అక్కడక్కడ మచ్చలు ఉంటాయి.
అలాగే మామిడిపండు సైజు చిన్నగా ఉంటుంది.ఇలా పండించిన పండ్లలో ఎక్కువ భాగం రసమే ఉంటుంది.

వీటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు, పసుపు కలిగిన ప్రకాశవంతమైన రంగులో ఈ పండు గుజ్జు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే సహజంగా పండిన మామిడి పండ్లలో గుజ్జు, రసం( Mango juice ) ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా కెమికల్స్ తో పండిన మామిడి పండ్లు తీపి తక్కువగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే తెలుపు రంగు, నీలం రంగు మచ్చలున్న మామిడి పండ్లను అసలు కొనకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే మామిడి పండ్లు కొనడానికి ముందు ఒక పండు తీసుకుని దాన్ని నీరు ఉన్న బకెట్లో వేయాలి.మామిడిపండు మునిగితే సహజమైనదిగా పైకి తేలితే రసాయనాలతో పండినట్లుగా గుర్తించవచ్చు. కెమికల్స్( Chemicals ) తో కూడిన ఈ రకమైన మామిడి పండ్లను కొనకుండా ఉండడమే మంచిది.ఇలాంటి మామిడి పండ్లు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.