హైదరాబాద్( Hyderabad ) రాడిసన్ డ్రగ్స్ కేసులో మరి కొంతమందిని విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పది మంది పేర్లను గచ్చిబౌలి పోలీసులు చేర్చారు.
వీరిలో నటి లిషి గణేశ్ డ్రగ్స్ పార్టీకి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు.అలాగే సొంత పూచీకత్తుపై నిందితులు కేదారీనాథ్, నిర్భయ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు.అలాగే కేసులో ముఖ్య పాత్రధారిగా ఉన్న వివేకానందకు( Gajjala Vivekanand ) కూకట్ పల్లి కోర్టు( Kukatpally Court ) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
.