లండన్లో( London ) హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడిని రైసుద్దీన్గా( Rayeesuddin ) గుర్తించారు.
మిత్రుడితో కలిసి బయటకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను కత్తితో పొడిచి చంపారు.అనంతరం అతని వద్ద వున్న నగదు, వస్తువులను దుండగులు దోచుకుని వెళ్లారు.
త్వరలోనే రైసుద్దీన్ కుమార్తె వాహం జరగనుంది.ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంతలోనే ఈ దారుణం జరగడంతో రైసుద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానిక నేత అంజదుల్లా ఖాన్.రైసుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.రైసుద్దీన్ మృతదేహాన్ని వెంటనే భారతదేశానికి తరలించేలా చూడాలని కుటుంబ సభ్యులు అంజదుల్లా ఖాన్ను కోరారు.
దీనిపై స్పందించిన ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్కు( External Affairs Minister Jaishankar ) మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై లండన్ పోలీసులు స్పందించారు.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఖాజా రైసుద్దీన్ను( Mohammed Khaja Rayeesuddin ) శనివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారని తెలిపారు.ఈ ఘటనలో రైసుద్దీన్ వెంట వున్న ఆఫ్ఘాన్ దేశస్థుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా వుందని పోలీసులు వెల్లడించారు.
వీరిపై దాడి చేసిన అనంతరం డబ్బు, నగలను ఎత్తుకుపోయారని చెప్పారు.దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇకపోతే.ఈ ఏడాది ఆగస్టులో యూకేలో( UK ) ఓ సిక్కు వ్యక్తి తన భార్యను చెక్క బ్యాటుతో దారుణంగా హత్య చేశాడు.ఈ విషయాన్ని స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి చెప్పాడు.ఇంగ్లీష్ గేమ్ రౌండర్స్లో ఉపయోగించే గట్టి చెక్క బ్యాట్తో హత్య చేసినట్లు అతను నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడు 79 ఏళ్ల తర్సమే సింగ్ అతని భార్య మాయాదేవి (77). ఈ నేరంలో భాగంగా తర్సమే .స్నారెస్బ్రూక్ క్రౌన్ కోర్టులో హాజరుకాగా.తూర్పు లండన్లోని హార్న్చర్చ్లోని తన ఇంటిలో భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు.