రాజీనామాను ఆమోదించాలని ఏపీ స్పీకర్‎కు గంటా విన్నపం..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో తన పదవికి రాజీనామా చేశారు.

అయితే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన స్పీకర్ ను కోరారు.రాజీనామాను ఆమోదిస్తే స్టీల్ ప్లాంట్ అంశం కేంద్రం దృష్టికి వెళ్తే అవకాశం ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే తన రాజీనామాను ఆమోదించాలని విన్నవించారు.అయితే కొన్ని రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు.

ఈ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు