ముఖం మాదిరి గానే బాడీని షైనీగా మెరిపించుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.కానీ, కఠినమైన సబ్బులను వాడటం వల్ల.
శరీరం రఫ్గా, కాంతిహీనంగా మారిపోతుంది.దాంతో ఈ సమస్య నుంచి బయట పడేందుకు రకరకాల బాడీ ఆయిల్స్, లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడుతుంటారు.
ఇవేమి మంచి ఫలితాన్ని ఇవ్వకుంటే ఏం చేయాలో తెలీక తెగ సతమతం అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక్క రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మరియు న్యాచురల్గా శరీరాన్ని షైనీగా మెరిపించు కోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బీట్రూట్ను తీసుకుని తొక్క తొలగించి ముక్కలను కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు పది గింజ తీసేసిన కుంకుడు కాయలను తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పోడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో బీట్రూట్ జ్యూస్, కుంకుడు కాయల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెసరి పిండి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.చివరగా అందులో తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకుని.శరీరం మొత్తానికి పట్టించాలి.
పదిహేను నిమిషాల పాటు ఆరిన అనంతరం మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్తో క్లీన్ చేసుకోవాలి.ఆపై సోప్ను యూజ్ చేయకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా చేస్తే శరీరానికి పట్టి ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం షైనీగా, గ్లోయింగ్గా మెరుస్తుంది.