కాకినాడ జిల్లా పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.మైనింగ్ అక్రమాలపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప, వైసీపీ నేత దొరబాబు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా మున్సిపల్ సెంటర్ కు వెళ్లేందుకు టీడీపీ, వైసీపీ నాయకులు ప్రయత్నించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులతో టీడీపీ, వైసీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
శాంతి భద్రతల దృష్ట్యా అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.







