సినీ ఇండస్ట్రీలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.ఇటీవలే ప్రముఖ నటి సమంత అరుదైన వ్యాదితో ఆస్పత్రిలో చేరగా తాజాగా మరో హీరోయిన్ ఓ వ్యాధితో బాధపడుతోంది.
హీరోయిన్ పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన అనారోగ్యానికి గురైయ్యారని సమాచారం.ఈ వ్యాధి కారణంగా అలసట, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక స్థితి సమస్యలు లక్షణాలని పేర్కొన్నారు.
రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.