యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే( Deepika Padakune ) ను హీరోయిన్ గా నటింపజేస్తున్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో దీపికా స్థాయి మరింతగా పెరిగింది.
దాంతో ఆమె వల్ల ప్రాజెక్ట్ కే యొక్క స్థాయి కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరగడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే దీపికా పదుకునే యొక్క సన్నివేశాలను ఇంకాస్త ఎక్కువగా పెంచే యోచనలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో ఈ సినిమా కోసం దీపికా ను అనుకున్న సమయంలో దాదాపుగా 7 నుండి 8 కోట్ల రూపాయలను ఆఫర్ చేయడం జరిగిందట.కానీ ఇప్పుడు పెరిగిన సీన్స్ మరియు కాల్షీట్స్ కారణంగా ఏకంగా రూ.10 కోట్ల రూపాయల పారితోషికంను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ కు వంద కోట్ల పారితోషికం ఇవ్వడం తో పాటు దీపికాకు ఆ స్థాయి లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటే ఏ స్థాయి లో ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.దీపికా పదుకునే యొక్క అందాల ఆరబోత ఈ సినిమా లో చూడం.కానీ ఈ సినిమా లో ఆమెను చాలా విభిన్నమైన పాత్రలో చూస్తామని మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమా లో మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ( Disha Patani ) కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు రూ.500 కోట్ల రూపాయలను అశ్వినీదత్ ఖర్చు చేస్తున్నారంటూ సమాచారం అందుతోంది.