పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న క్రేజీ మూవీ భీమ్లా నాయక్.మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది.అయితే సినిమాలో ఐశ్వర్యా రాజేష్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.భీమ్లా నాయక్ నుండి ఐశ్వర్య ఎగ్జిట్ అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్.
ఆమె బదులుగా సంయుక్త హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు.
మరి ఐశ్వర్య రాజేష్ ఎందుకు ఆ సినిమా నుండి తప్పుతుందో వివరాలు తెలియాల్సి ఉంది.
ఈమధ్య వచ్చిన నాని టక్ జగదీష్ సినిమాలో కూడా నాని మేనకోడలి పాత్రలో నటించింది ఐశ్వర్య రాజేష్.కోలీవుడ్ లో ఆమెకు స్టార్ క్రేజ్ ఉన్నా తెలుగులో మాత్రం ఐశ్వర్యా రాజేష్ కు సరైన అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.
అయితే పవన్ లాంటి క్రేజీ స్టార్ సినిమాలో నటిస్తే అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు మా సినిమా నుండి ఐశ్వర్య ఎగ్జిట్ అవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.