ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న అనంతబాబు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
ఇటీవలే అనంతబాబు తల్లి మరణించడంతో.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు.ముందుగా రాజమహేంద్రవరం కోర్టు 3 రోజులు బెయిల్ మంజూరు చేయగా.
దానిపై అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో బెయిల్ను మరో పదకొండు రోజుల పాటు పొడిగిస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన బెయిల్ గడువు ముగియడం, రెగ్యులర్ బెయిల్పై విచారణ వాయిదా వేయడంతో అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయారు.