ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.ఈ క్రమంలో పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబును ఈనెల 16న ఏసీబీ కోర్టులో హాజరు పర్చాల్సి ఉందని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా అన్నారు.
ఆ రోజు హాజరుపరిస్తే అరెస్ట్ చేస్తారని ఈ పిటిషన్ నిరర్థకమవుతుందని లూథ్రా తెలిపారు.ఈనెల 16 వరకు అరెస్ట్ ఉండదని సీఐడీ తరపున లాయర్ ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు.
లేదంటే ట్రయల్ కోర్టులో కేసును ఈనెల 17కు వాయిదా వేయాలని కోరతామని ముకుల్ రోహత్గి వెల్లడించారు.