సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఏపీలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.ఈ మేరకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.

 Hearing In The Supreme Court On The Petition Of Citizen For Democracy-TeluguStop.com

వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆరోపించింది.వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఎన్నికల అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఈ క్రమంలో ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సంస్థ సుప్రీంకోర్టును కోరింది.

వైసీపీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని పేర్కొంది.వాలంటీర్ల వ్యవస్థ వలన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాలంటీర్లు సమాచారం మొత్తాన్ని వైసీపీ సభ్యులకు అందిస్తున్నారని పేర్కొంది.

ఈ క్రమంలోనే ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపించింది.ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని న్యాయస్థానాన్ని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube