మనం ప్రతి రోజు వంటల్లో పసుపును ఉపయోగిస్తాం.పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి సహాయపడే ఫైటిన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి.
పసుపు ఒక సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్గా పనిచేసి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి.
పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీర ఆరోగ్యంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది.ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాస్ వేడి నీటిలో 1/4 టీ స్పూన్ పసుపు కలుపుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పరగడుపునే గ్లాస్ వేడి నీటిలో పసుపు కలుపుకుని తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి మధుమేహం అదుపులో ఉంటుంది.
సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పులు,వాపులు తగ్గుతాయి.
ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారు త్రాగితే చాలా మేలు చేస్తుంది.
రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్త సరఫరా మెరుగుపడుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
శరీరంలో ఉన్న విషాలను బయటకు పంపి శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది.
పసుపులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు మరియు ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.
పసుపులో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న పసుపు నీటిని త్రాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.