అతనో జూనియర్ ఇంజనీర్ జల్సాలు కోసం దొంగతనం.చివరకు.? అతను జూనియర్ ఇంజనీర్ ప్రముఖ విద్యుత్ కంపెనీలో పని చేస్తున్నాడు.ఆదివారం ఆయన పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు.
చూస్తే జేబులో చిల్లిగవ్వలేదు.ఎలాగైనా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అనుకున్నాడు.
దీంతో దొంగతనానికి పాల్పడ్డాడు.పోలీసులకు చిక్కిన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని చెందిన జ్యోతి నగర్ కి చెందిన మోహిత్ గౌతమ్ విద్యుదుత్పత్తి (బీఎస్ఎస్ఈసి) కంపెనీ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.అయితే జూలై 25న అది పుట్టినరోజు నెల కావడంతో చేతిలో పైసా చిల్లిగవ్వ లేదు దీంతో మానససరోవరం పార్క్ వద్ద ఒంటరిగా వెళ్తున్న మహిళ అడ్డగించి చెవి రింగులు ఎత్తుకెళ్లాడు.
దీంతో ఆమె దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బైక్ నెంబర్ ప్లేట్ ను నెంబర్ లేకుండా ఉందని గమనించారు.అదేవిధంగా బాధితురాలు చెప్పిన ఆధారంగా పోలీసులు వెతకడం ప్రారంభించారు.పుట్టిన రోజున ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడం కోసం జగత్ పురి లోని లైన్ షాప్ కి వెళ్ళాడు. నెంబర్ ప్లేట్ లేని బండి ని పోలీసులు గుర్తించారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తను ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తుందని పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.చెవి రింగులు అమ్మేసానని ఇప్పుడు నా దగ్గర లేవు అని విచారణలో పోలీసులకు తెలియజేశాడు.