పవర్ స్టార్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.
సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.వీరమల్లు సినిమా షూట్ రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన ఇప్పటికి పూర్తి చేయలేదు.
ఇది పూర్తి కాకుండానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.
ఇక ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.
పవర్ స్టార్ రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించ బోతున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు.ఈ సినిమా ఒరిజినల్ లో విజయ్ కూతురుగా మీనా కూతురు నటించింది.ఈ సినిమాలో కూతురు పాత్ర చాలా కీలకం.విజయ్, సామ్ కూతురుగా మేన కూతురు కనిపిస్తుంది.
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురుగా ఎవరు నటిస్తారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది.మరి బన్నీ కూతురు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో బన్నీ కూతురును ఈ సినిమాలో పవర్ స్టార్ కూతురు పాత్రలో తీసుకోవాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు కూడా టాక్.
మరి నిజంగానే ఈమె ఉంటుందా లేదా అనేది చూడాలి.