అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.గోవింద్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.కాగా గోవింద్ ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు.వడ్డీ, అసలు చెల్లించినా మళ్లీ రూ.3 లక్షలు ఇవ్వాలంటూ ఫైనాన్స్ కంపెనీ వేధిస్తుందని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం గోవింద్ పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.