సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ”గుంటూరు కారం”( Guntur karam ).కృష్ణ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం మహేష్ బాబు నటిస్తున్న 28వ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను పెట్టి ఆడియెన్స్ అండ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు.
మంచి మాస్ మసాలా సినిమాగా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈ అవైటెడ్ కాంబో నుండి వచ్చిన ఈ గ్లింప్స్ సహా టైటిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
దీంతో టీమ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్( Harika Hasini Banner ) పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఈ గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కు అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.దీంతో నిర్మాత నాగ వంశీ( Naga Vamsi ) ఫ్యాన్స్ కు ఆడియెన్స్ అందరికి థాంక్స్ చెబుతూ తదుపరి అప్డేట్ గురించి కూడా బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
మహేష్ బాబు బర్త్ డే రోజున అంటే ఆగస్టు 09న ఈ సినిమా నుండి మరో బిగ్ అప్డేట్ ఉంటుంది అని ముందుగానే చెప్పి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు.మొత్తానికి ఫస్ట్ గ్లింప్స్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసుకోగా మరో అప్డేట్ గురించి కూడా చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూసేలా చేసారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.