ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ -1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కాగా 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల అయింది.జనవరి 1వ తేదీ నుంచి 21 వరకు అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుందని అధికారులు తెలిపారు.
అలాగే నోటిఫికేషన్ ప్రకారం మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.