ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:మరాఠా ధీరుడుగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు చత్రపతి శివాజీ అని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాల్వాయి రమేష్ అన్నారు.

ఆదివారంహిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగానిర్వహించారు.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ భారతజాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన యోధుడు శివాజీ అని కొనియాడారు.

అలాంటి గొప్ప వీర యోధుడి జయంతిని అందరూ జరుపుకోవాలని, శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, దేవిరెడ్డి నాగిరెడ్డి,బాల వెంకటేశ్వర్లు,కొణతం నాగిరెడ్డి,కాల్వ సైదులు, పాల్వాయి పృథ్వీ,ఎడవెల్లి సైదిరెడ్డి,తాళ్ల నరేందర్ రెడ్డి,తాటికొండ పరమేశ్వర్ రెడ్డి,సరికొప్పుల నాగేశ్వరరావు,కడియం సతీష్,వెన్నం సురేష్,రాగిరెడ్డి,సూర్య తేజ,ఉరిమిళ్ళ రామ్మూర్తి, చారగుంట్ల సైదులు,బాలెన వెంకటకృష్ణ,ఎడవెల్లి నర్సిరెడ్డి,పుల్లెంల సైదులు, రాచకొండ శ్రీను,సాయి, ఈశ్వర్,ఊట్కూరు నటరాజ్,లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు