జ‌గ‌న్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం....

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చెప్పుతో కొట్టాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఈ విష‌యంలో తెలుగుదేశం సీనియ‌ర్లు, మంత్రులు జ‌గ‌న్‌పై మాట‌ల యుధ్ధానికి తెర‌లేపారు.

 Govt Take Over The Assets Of Jagan-TeluguStop.com

జగన్‌కు ప్రతిపక్ష నేతల లక్షణాలే కాదు… సంస్కారం కూడా లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానిస్తూ, త్వ‌ర‌లోనే .అటాచ్‌ చేసిన జగన్‌ ఆస్తులను త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్ప‌ష్టం చేసారాయ‌న

జగన్ తల్లిదండ్రులు ఆత‌నికి సంస్కారం నేర్పక పోవ‌టంతో పనికిరాకుండా పోయిన వ్య‌క్తిని సమాజంలోకి వదిలిందంటూ వైఎస్ కుటుంబం కుటుంబంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమ‌ర్శ‌ల‌కు దిగ‌గా,… ఆర్థిక ఉగ్రవాది జగన్‌ను ప్రజలు చెప్పుతో కొట్టి ఏ నాడో పక్కనబెట్టారని, క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం నేత బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు డిమాండ్ చేసారు.

అలాగే రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌రో అడుగు ముందుకేసి జ‌గ‌న్ తీవ్ర డిప్ర‌ష‌న్‌లో ఉన్నార‌ని, టైంకు సరిగ్గా మందులు వేసుకోవాలని, ఆ మందులు పనిచేయకపోతే మంచి డాక్టర్‌ను సంప్రదించాలని, దేశంలో మంచి.మంచి డాక్టర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.

ముందు భాష, పద్ధతి మార్చుకోకుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోవ‌ని హెచ్చ‌రించారు.

ఎన్నిక‌ల ముందు జగన్‌ ఓదార్పు యాత్రలతో ఓట్ల‌ని దండుకోవాల‌ని చూసినా, ప్ర‌జ‌లు అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకే ప‌ట్టం క‌ట్టార‌ని, ఈ స‌త్యాన్ని గ్రహించ‌ని జ‌గ‌న్ రాష్ట్ర న‌వ‌నిర్మాణ కోసం కృషి చేస్తున్న చంద్ర‌బాబుని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, మంత్రి ప‌త్తిపాటి విమ‌ర్శించారు.

మ‌రోవైపు రాష్ట్రంలోని ప‌లు చోట్ల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే కార్య‌క్ర‌మాన్నికి శ్రీ‌కారం చుట్టారు తెలుగుదేశం నేత‌లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube