ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) పెట్టుబడి పెట్టడానికి, రాబడిని సంపాదించడానికి గవర్నమెంట్ బాండ్స్( Government Bonds ) సురక్షితమైన మార్గం.ప్రాజెక్ట్లు, రోజువారీ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఈ బాండ్లను భారత ప్రభుత్వం జారీ చేస్తుంది.
ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు నిర్దిష్ట కాలానికి నిర్ణీత వడ్డీ రేటును పొందవచ్చు.ఎన్నారైలు( NRI ) పెట్టుబడి పెట్టగల, ఎక్కువ రాబడి అందుకోగల ప్రభుత్వ బాండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1.పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU), క్యాపిటల్ బాండ్స్:
ఇవి ట్యాక్స్ ఫ్రీ బాండ్లు, వాటిపై మీరు సంపాదించే వడ్డీ కూడా పన్ను రహితం.కానీ పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉండదు.క్యాపిటల్ గెయిన్స్ బాండ్లు కొన్ని షరతులలో పన్ను మినహాయింపును అందిస్తాయి.

2.సురక్షిత కార్పొరేట్ బాండ్లు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs):
ఈ బాండ్లు కంపెనీలచే జారీ చేయబడతాయి, వివిధ కాల వ్యవధిని కలిగి ఉంటాయి.వీటిని వివిధ మార్కెట్లలో ట్రేడ్ కూడా చేయవచ్చు.
3.డెట్ మ్యూచువల్ ఫండ్స్:
ఎన్నారైలు ఈ ఫండ్స్లో వారి నాన్-రెసిడెంట్ ఆర్డినరీ(NRO) లేదా నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్(NRE) ఖాతాల నుండి పెట్టుబడి పెట్టవచ్చు.ఇవి స్థిర వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి.
4.జీరో-కూపన్ బాండ్స్:
ఈ బాండ్లు తగ్గింపు ధరకు సేల్ అవుతాయి.మెచ్యూరిటీ తర్వాత లాభాలను అందిస్తాయి.

5.ఆర్బీఐ ఎన్నారై బాండ్స్:
భారతీయ రిజర్వ్ బ్యాంక్( RBI ) ఈ బాండ్లను వివిధ కాలాలు, వడ్డీ రేట్లతో జారీ చేస్తుంది.
6.భారత్ బాండ్ ETF లేదా FOF:
ఇవి సురక్షితమైన పెట్టుబడులుగా పేరు తెచ్చుకున్నాయి అంతేకాదు మంచి రాబడిని కూడా అందిస్తాయి.అవి ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలచే జారీ చేయబడిన ట్రేడబుల్ డెట్ ఈటీఎఫ్లు లేదా బాండ్లు.
ఎన్నారైలు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి, కాలక్రమేణా వృద్ధి చెందడానికి ఈ ఎంపికల నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు.ప్రభుత్వ పథకాలకు మద్దతు ఇస్తూనే రాబడిని పొందేందుకు ఇది మంచి మార్గం.







