ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలకు TRS ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుంది అన్ని సీఎం కెసిఆర్ పైన అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం కుక్క అనడాన్ని నిరసిస్తూ గోషామహల్ TRS నాయకుడు నంద కిషోర్ వ్యాస్ బిలాల్ అస్సాం సీఎం ప్రసంగానీ అడ్డుకొని మైకను లగేసారు.దీంతో వెంటనే ఉత్సవ సమితి నిర్వాహకులు నందు బిలాల్ ను సభ వేదిక నుండి క్రిందికి తోసేసారు.
అప్రమతమైన పోలీసులు నందు బిలాల్ ను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.
దీంతో నందు బిలాల్ అనుచరులు మరియు TRS మహిళ నాయకురాలు తమ నాయకుడు నందు బిలాల్ అరెస్ట్ చేయడాని నిరసిస్తూ స్టేజి ముందు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
తమ నాయకుడిని బేషరత్తుగా పోలీసులు విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.దీంతో మహిళ పోలీసులు ఆందోళనకు దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఖబర్దార్.గోశామహల్ టి ఆర్ ఎస్ నేత నందు బిలాల్.
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా. గణేష్ ఉత్సవాలు వచ్చారు.

ధర్మ కార్యక్రమానికి వచ్చిన అస్సాం సీఎం.రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు.మా ముఖ్యమంత్రిని దూషించారు.దీంతో మేం సహనం కోల్పోయి మైక్ లాక్కొని అడ్డుకున్నాం.మా నిరసన వ్యక్తం చేసాం.గణేష్ శోభయాత్రకు వచ్చిన సీఎం.
శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు.రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే.
మేం ఉరుకోమ్.ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరగనివ్వండి.
మరోసారి బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పై అనుచిత వాఖ్యలు చేస్తే ఖబర్దార్.