స్మార్ట్ఫోన్ల విషయంలో చాలా మందికి వేధించేది చార్జింగ్.ఇంటి నుంచి ఆఫీసుకు లేదా వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు సొంత చార్జర్ మర్చిపోయినపుడు తీరా మొబైల్ లో ఛార్జింగ్ అయిపోయినపుడు ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేనిది.
ఎదుటివారిని అడగలేము, మనలేము.బయటకి వెళ్లిన ప్రతిసారీ చార్జింగ్ పెట్టుకోవడం లేదా చార్జర్ పట్టుకోవడం అనేది కొన్నిసార్లు కుదరదు.
కొందరి దగ్గర నార్మల్ కేబుల్ చార్జర్ ఉంటే.ఇంకొందరి దగ్గర టైప్-సి కేబుల్ ఉంటుంది.
దీంతో ఒక డివైజ్పై పని చేసే కేబుల్ మరో డివైజ్కు పనిచేయదు.
ఈ ఛార్జింగ్ గోల మానమొక్కరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఇలాంటి సమస్యతో కాస్త సతమతం అవుతున్నారు.
ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది EU (యురోపియన్ యూనియన్).తమ యూనియన్ పరిధిలో విక్రయించే అన్ని డివైజ్లకు టైప్-సి కేబుల్ మాత్రమే వాడేలా చట్టం చేసింది.2024 చివరికల్లా యురోపియన్ యూనియన్ పరిధిలో విక్రయించే ప్రతి డివైజ్.టైప్-సి చార్జర్తోనే పని చేయాలి.
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్, డిజిటల్ కెమెరాలు వంటి చిన్న గాడ్జెట్స్ అన్నింటికీ ఇదే కేబుల్ వాడాలి.చివరికి కొత్తగా వచ్చిన ఐఫోన్లకు కూడా ఈ కేబులే ఉండాలి.
2026 కల్లా ల్యాప్టాప్తోపాటు అన్ని డివైజ్లు, గ్యాడ్జెట్లకు కూడా టైప్-సి కేబుల్ ఉండాల్సిందే.ఇది అనేక కంపెనీలకు ముఖ్యంగా.యాపిల్ సంస్థకు పెద్ద దెబ్బే.ఎదుకంటే ఈ సంస్థ ప్రత్యేకంగా లైట్నింగ్ పోర్టుల్ని మాత్రమే చార్జింగ్ కోసం తయారు చేస్తుంది.కానీ, ఇకపై ఇలా కుదరదు.యాపిల్ కూడా తమ ఫోన్లు, ట్యాబ్లెట్లుసహా అన్ని గ్యాడ్జెట్లను టైప్-సి కేబుల్కు అనుగుణంగానే తయారు చేయాలి.
ఈయూలో అమ్ముడవుతున్న గ్యాడ్జెట్లలో 20 శాతం యాపిల్ ఉత్పత్తులే.ఇక ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది.
అన్నింటికీ ఒకే కేబుల్తో చార్జింగ్ చేసుకోవచ్చు.