ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏపీ క్యాబినెట్ భేటీ శుక్రవారం జరగనుంది.సీఎం జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ క్యాబినెట్ భేటీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది.
జరగబోయే క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించనుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి సమస్య చర్చనీయాంశంగా ఉంది.
ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పిఆర్సి జీవోను.వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.
సమ్మెలోకి వెళ్లేందుకు సైతం రెడీ అయ్యే రేపు నోటీసు.అందించడానికి ఉద్యోగ సంఘాల నాయకులతో ఉద్యోగస్తులు కూడా సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఉద్యోగస్తుల సమస్యపై.చర్చ జరగనున్నట్లు సమాచారం.ఇక ఇదే తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి కూడా చర్చ జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి.పండగ తర్వాత ఏకంగా 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో పాటు పలు జిల్లాలలో… ఉన్నట్టుండి ఒక్కసారిగా వెయ్యికి పైగా కేసులు నమోదు కావటం రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగి స్తున్నట్లు పరిస్థితి మారింది.
ఇక ఇదే సమయంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో కూడా కేబినెట్లో చర్చ జరగనున్నట్లు.తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తంమీద చూసుకుంటే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలు.ఉద్యమ బాట పట్టడానికి రెడీ అయిన సమయంలో శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.