మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.మంత్రి పదవి పోయినా.
నియోజకవర్గంలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె.తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి.హాట్ కామెంట్స్ చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.ప్లేస్ మీరు చెప్పినా.
నన్ను చెప్పమన్నా.ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని.నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.
2014 ఎన్నికల్లో 14 వేల మెజారిటీ, 2019 లో 26 వేలకు పైగా మెజారిటీ వచ్చిందని., రాబోయే ఎన్నికల్లో అంతకు మించిన మెజారిటీతో గెలవబోతున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు.మీరు ఎన్ని విమర్శలు చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు.