తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి మండిపడ్డారు.కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సొంత మనుషుల కోసం పేపర్ లీక్ చేశారని పొంగులేటి ఆరోపించారు.పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలన్న పొంగులేటి నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.