మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై సస్పెన్స్ కు తెరపడింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారు అయిందని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల ముఖ్యనేతలతో పొంగులేటి సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా హస్తం పార్టీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
మెజార్టీ అనుచరుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.సమావేశం అనంతరం పొంగులేటి హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
అక్కడ మాజీ మంత్రి జూపల్లి వంటి ముఖ్యనేతలను ఆయన కలిసే అవకాశం ఉందని సమాచారం.