ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ హర్షకుమార్ భేటీ అయ్యారు.గంటపాటు ఖర్గేతో ఏకాంతంగా సమావేశం అయ్యారని సమాచారం.
ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.ఏపీ కొత్త పీసీసీలో హర్ష కుమార్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని భావించారు.
అయితే ఆ బాధ్యతలు స్వీకరించేందుకు హర్ష కుమార్ నిరాకరించారు.కొత్త బాధ్యతలు తీసుకోవడం లేదని ఖర్గేకు చెప్పారు.
పార్టీలో సాధారణ కార్యకర్తగానే ఉంటానని చెప్పినట్లు సమాచారం.