కాకినాడ జిల్లా, పెద్దాపురం: పెద్దాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. టీడీపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్టు రాజప్ప తెలిపారు.
వేడుకలు ఏమైనా ఉంటే పేదప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయాలని రాజప్ప టీడీపీ నాయకులను కోరారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు భారీగా పేద ప్రజలు పాల్గొన్నారు.







