పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి చంద్రబాబు మరియు వైయస్ జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో విద్యపై ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం వైసీపీ తప్ప మరొకటి లేదని చెప్పుకొచ్చారు.
విద్య పై పెట్టుబడి అనేది విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టుతుందని చెప్పుకొచ్చారు.చంద్రబాబు విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యని పేద గడపలకు చేర్చాలని చెప్పుకొచ్చారు.
సామాజిక ఇంకా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని స్పష్టం చేశారు.
విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వైయస్ జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలియజేశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.
దీంతో ప్రతిపక్షాలు ఓర్చుకోలేక దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుంటే ప్రతిపక్షాలు అల్లర్లు మరియు వర్గ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణలు చేశారు.