ఆంధ్రప్రదేశ్:పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది.ఒకే కుటుంబానికి చెందిన సుమారు 12 మంది బజ్జీలు తినగా వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా మారిందని తెలుస్తుంది.
మండలంలోని ఎస్.కొండేపాడు ( S.Kondepadu )గ్రామానికి చెందిన వీరంతా బుధవారం మధ్యాహ్నం బజ్జీలు తిన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.9 మంది బాధితులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సీరియస్ గా ఉన్న ముగ్గురిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
.






