తెలంగాణ:మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ( Thippiri Tirupati alias Dev Ji ) నేడు జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.అడవిబాట పట్టి 40 ఏళ్ల తర్వాత తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన గన్ను వదిలి పెన్ను పట్టుకున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈరోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సెకండియర్ తెలుగు పరీక్ష రాశారు.లాయర్ కావాలనే లక్ష్యంతో మళ్లీ పుస్తకం పట్టినట్లు తెలిపారు.
ఇంటర్ పాసైన అనంతరం డిగ్రీ,ఆ తర్వాత ఎల్ఎల్ బి చదవాలని ఉందన్నారు.







