నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం సాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 3,79,232 లక్షల క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 588 అడుగులుగా కొనసాగుతోంది.
అదేవిధంగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 307 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.