నెల్లూరు జిల్లాలోని జీజీహెచ్ లో ఐదేళ్ల బాలుడు మిస్సైన ఘటన అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఆస్పత్రిలో మహిళ దగ్గర నుంచి గుర్తు తెలియని దుండగులు బాలుడిని అపహరించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చింది.ఆ సమయంలో బాలుడిని అపహరించుకుని వెళ్లారని తెలుస్తోంది.
సోమవారం సాయంత్రం నుంచి బాలుడు కనిపించడం లేదు.దీంతో బిడ్డను క్షేమంగా తన వద్దకు చేర్చాలని బాధిత మహిళ వేడుకుంటుంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







